విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ జంట దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. 2025 ఫిబ్రవరిలో రెండు బంగారు దుకాణాల్లో ఉంగరాలు చోరీ చేసిన గణేష్, మాణిక్యేశ్వరి అనే భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కోర్టు వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించింది. మరోవైపు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. పాడుబడిన భవనం పక్కన 15 మొక్కలు ఉండటంతో పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.