సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ను సీజ్ చేసినట్లు తెలిసింది. ఫాంహౌస్ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా మొయినాబాద్ ఫౌంహౌస్ సీజ్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.