మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులను కోర్టు.. పోలీస్ కస్టడీకి అప్పగించింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను విచారణ జరపనున్న పోలీసులు.. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. అసలు డ్రగ్స్ను ఎవరు సరఫరా చేశారు.. ఆ నెట్వర్క్ ఏంటి అనేది కూపీ లాగనున్నారు.