బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్లోని సీసీఐ ఫ్యాక్టరీని పునర్ ప్రారంభించకకుండా.. ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్గా ఆమ్మేసేందుకు ఆన్లైన్లో టెండర్లు పిలవటంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు.. పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విషయంపై పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసినా... కనీసం కనికరించలేదని కేటీఆర్ గుర్తు చేశారు.