సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన మంచి అనుబంధం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా టుటై కాంక్లేవ్-2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో ఉన్న రిలేషన్, హైదరాబాద్ అభివృద్ధితో పాటు చంద్రబాబు, కేసీఆర్ మీద కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.