శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తూ.. సొమ్ముచేసుకుంటున్న ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నాయి. అయినాసరే కొన్నిసార్లు వారిపైనే దాడిచేసి.. ప్రాణాలు సైతం తీయడానికి స్మగ్లర్లు వెనుకాడటం లేదు. తాజాగా, మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏడాదిన్నరగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. చివరకు లంకమల్ల అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. అతడి వద్ద 80 కిపైగా దుంగలు లభ్యమయ్యాయి.