Mohan Babu Get Relief From Supreme Court: మంచు మోహన్బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019 నుంచి వెంటాడుతున్న కేసుli కోర్టు కొట్టివేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై ధర్నా చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈకేసుతో సంబంధం ఉన్న అన్ని చర్యలను రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ తీర్పుతో మంచు కుటుంబానికి రిలీఫ్ దక్కింది.