Tirupat Mohanbabu University Student Suicide: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని భువన ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె సోమవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భువనకు రూ.17 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఇంతలోనే ఆమె ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.