నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్యాచారం కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు చాలాకాలంగా జైలులో ఉన్నాడని, ఛార్జిషీటు దాఖలుు చేశారని బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేర తీవ్రత, నిందితుడి ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. కావలిలో ఓ కాంపౌండర్ తాను పనిచేస్తున్న డాక్టర్ భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.