సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహాలు ఆర్భాటంగా మారుతున్న తరుణంలో.. ఇద్దరు యువ అధికారులు తమ పెళ్లిని అత్యంత నిరాడంబరంగా జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం చట్టబద్ధంగా, రెండు సంతకాలతో వివాహం చేసుకున్నారు. ఈ ఆదర్శవంతమైన వివాహ వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.