యాదాద్రి: సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ల కూతురిని చంపిన తండ్రి

1 month ago 9
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో కుటుంబ కలహాలు ఒక పసి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యతో ఉన్న గొడవల కారణంగా తన రెండేళ్ల కుమార్తె చంపాలని నిర్ణయించుకున్న తండ్రి సపోటా పండులో ఎలుకల మందు పెట్టి చిన్నారికి ఇచ్చాడు. అది తిన్న చిన్నారి వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రెండ్రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. తండ్రి కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article