యాపిల్ వస్తువులంటే హోదా అనుకునేవారికి ఇది హెచ్చరిక.. హైదరాబాద్లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల దందా గుట్టు రట్టయింది. అసలైన వాటిని పోలిన నకిలీ వస్తువులను తక్కువ ధరకే అమ్ముతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు దాడి చేసి రూ.3 కోట్ల విలువైన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసగాళ్ల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. యాపిల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.