తెలంగాణ నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణతో పాటు రూ. 1,468 కోట్ల పాత బకాయిలను విడుదల చేయాలని కోరారు. పోషకాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేయగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇక బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను రిక్వెస్ట్ చేశారు.