తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోంది. దీనిలో భాగంగా.. పంట పెట్టుబడి కోసం రైతుభరోసా కింద ఏడాదికి రూ.12 వేలు అందిస్తుండగా.. సన్నాలకు బోనస్ కింద రూ.500 క్వింటాల్కు అందిస్తోంది. అయితే ప్రస్తుతం యాసంగిలోనూ సన్న బియ్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వానాకాలం సీజన్లో మొత్తం రూ.1700 కోట్లు బోనస్ అందజేసినట్లు తెలిపారు.