పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ రామగుండం ఎరువుల కర్మాగారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలగడంతో, అధికారులు యూరియా ఉత్పత్తిని సగానికి పైగా తగ్గించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కొరత తప్పదని, వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.