హైకోర్టు తనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని.. ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని.. రాజకీయ పోరాటాలు తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. మళ్లీ ప్రజాక్షేత్రంలో పోరాడి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల వివాదంతో మొదలైన అనర్హత వ్యవహారంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్లో ఉపఎన్నికపై రాజకీయ చర్చ మొదలైంది.