రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యువ మహిళా లాయర్ స్వప్న హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. లాయర్ స్వప్నను ఆమె సోదరుడే అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగానే ఆమెను కిరాతకంగా హతమార్చినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఇంకో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.