Nandyal Leopard Nails Case 7 Arrest: నంద్యాల జిల్లాలో చిరుతపులి గోళ్ల వ్యవహారం కలకలం రేపింది. విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన చిరుతపులి గోళ్లను విక్రయించిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో ఈ వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి ఐదు చిరుత గోళ్లు, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 2023లో ఈ ఘటన జరిగింది.. ఇప్పుడు నిందితుల్ని అరెస్ట్ చేశారు.