జనగామ జిల్లాకు చెందిన రాజు అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యానికి లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హీరో ప్రభాస్, సోనూసూద్ సహాయం కోసం సొంతూరు నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించాడు. తన ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ వారిని ఆదుకోవాలని కోరుతున్నాడు.