పంద్రాగస్టు వేడుకల సందర్భంగా యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. నేటి యువత దేశ భవిష్యత్తు మాత్రమే కాదని.. బలం కూడా అని అభివర్ణించారు. యువతరం ప్రశ్నించే తత్వం వదిలేయకూడదన్న పవన్.. కానీ ప్రశ్నించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోరే యువత మాత్రమే కాదని.. అవకాశాలు సృష్టించేవారు కూడా కావాలని సూచించారు. తప్పుడు సమాచారానికి ఆలోచనను అమ్ముకోవద్దని.. ద్వేషానికి భవిష్యత్తును అప్పగించవద్దని సూచించారు.