ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెంచే దిశగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేనతో సేనాని- మన నేల కోసం కలిసి నడుద్దామంటూ కొత్త కార్యక్రమం చేపట్టనున్నారు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు ఇందులో పాల్గొనవచ్చన్న పవన్ కళ్యాణ్.. ఆసక్తి కలిగిన వారు నమోదు చేసుకోవాలంటూ క్యూఆర్ కోడ్ను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ కూడా క్యూఆర్ కోడ్, లింక్ షేర్ చేసింది.