Police case on Youtuber Rama nandana inIbrahimpatnam: యూట్యూబర్ రమా నందన అలియాస్ నందు, ఆమె కుటుంబంపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యువల్ పేరుతో రూ.15 లక్షలు మోసం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రమా నందన, ఆమె భర్త మధుకర్, మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు తెలిపారు.