గ్రామంలోకి రాకపోకలు సాగించేందుకు సరైన సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్నారు విజయనగరం జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు. వారి సమస్య గురించి తెలుసుకున్న ఓ యూట్యూబర్.. తన సొంత డబ్బుతో ఆ గ్రామానికి వంతెన కట్టించి ఆదుకున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక, గెడ్డ దాటలేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యను తీర్చిన అతని మానవత్వం అందరినీ ఆకట్టుకుంటోంది. రూ.లక్ష ఖర్చు చేసి గెడ్డ మీద మిని వంతెన నిర్మించి.. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యను పరిష్కరించాడు. ఆ వివరాలు..