ఆక్వా రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త వినిపించారు. జూన్ ఒకటో తేదీ నుంచి 12 వేల విద్యుత్ కనెక్షన్లకు అదనంగా కరెంట్ రాయితీ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యూనిట్కు రూ.1.50 రాయితీ అందించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఫారం సైజుతో పని లేకుండా,. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే అంశంతో అవసరం లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.