ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం తీసుకున్న చర్యపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. యూపీలోని రోడ్లపై సైన్ బోర్డులను తెలుగులోనూ ఏర్పాటు చేయించడాన్ని నెటిజనం స్వాగతిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తెలుగు భాష మీద యోగి సర్కారుకు ఉన్న గౌరవాన్ని, వారు ఇచ్చిన ప్రాధాన్యాన్ని నెటిజనం ప్రశంసిస్తున్నారు. యూపీ ప్రభుత్వం చర్యలను అభినందిస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి యూపీ వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.