విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. లక్షలాది మంది సాగరతీరంలో యోగాసనాలు వేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. యోగా అనేది మానవతను పెంచే ప్రక్రియ అని, ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చునని మోదీ ఉద్ఘాటించారు. గత పదేళ్లలో యోగా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని ఆయన అన్నారు.