రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. పేదరికం కారణంగా 13 ఏళ్ల బాలికకు ఆమె తల్లి 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసింది. అయితే చదువుకోవాలనే ఆశతో ఆ బాలిక ధైర్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది. పోలీసులు వెంటనే స్పందించి బాలిక తల్లి, వరుడు, మధ్యవర్తి, పూజారిపై బాల్య వివాహాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం బాలికను రెస్క్యూ హోమ్కు తరలించారు.