ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడు రంగారెడ్డి జిల్లా నేలలో లభించింది. జిల్లాలోని వ్యవసాయ పొలాల నుంచి సేకరించిన నేల బ్యాక్టీరియాలో యాంటీమైక్రోబియల్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగిన కొత్త జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలగప్ప విశ్వవిద్యాలయ పరిశోధకుడు సంజీవ్ కుమార్ సింగ్ బృందం 'స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్'తో సహా నాలుగు బ్యాక్టీరియా జాతులను గుర్తించింది. ఈ జాతులు ప్యూసెమైసిన్ వంటి సమ్మేళనాలను ఉత్పత్తి చేసి, యాంటీ-ట్యూమర్ లక్షణాలు కలిగి ఉన్నాయని తేలింది. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఇది కీలక పాత్ర పోషించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.