ఎన్నికల హామీ నిలబెట్టుకునేందుకు తెలంగాణలో కొందరు సర్పంచ్లు శాస్త్రీయ పద్ధతులకు బదులు విషం పెట్టి కుక్కలను చంపుతున్నారు. పలు జిల్లాల్లో వందలాది కుక్కలను ఇలా అమానుషంగా హతమార్చారు. తాజాగా యాచారంలో 100కు పైగా కుక్కలను చంపేయగా.. పోలీసులు సర్పంచ్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.