రాఖీ వేళ కేసీఆర్ కుటుంబంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు కవిత, కేటీఆర్ మధ్య పొలిటికల్ గ్యాప్ గురించి ఊహాగానాలు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. కేటీఆర్ బెంగళూరులో ఉండటంతో కవిత తన సోదరుడికి రాఖీ కట్టలేకపోయారు. గతంలో జైలులో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఈ పరిణామం వారి మధ్య దూరం పెరిగిందనడానికి సంకేతమని అంటున్నారు. వైఎస్ జగన్, షర్మిల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది.