TDP Janasena Ysrcp Donations 2024-2025 Details: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. తెలుగుదేశం పార్టీకి రూ.83 కోట్లు, జనసేనకు రూ.25.33 కోట్లు, వైఎస్సార్సీపీకి రూ.140.03 కోట్లు, బీఆర్ఎస్కు రూ.15.09 కోట్లు విరాళాలు అందాయి. ఆసక్తికరంగా 2023-2024తో పోలిస్తే ఈసారి టీడీపీకి విరాళాలు తగ్గాయి. ఎంఐఎం పార్టీకి రూ.20 వేలకు మించి విరాళాలు రాలేదని నివేదికలు తెలిపాయి. రాజకీయ పార్టీలు రూ.20వేలకు మించిన విరాళాలు వెల్లడించాల్సిందే.