రాష్ట్రంలో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రస్థా్యి అటవీ అధికారుల వర్క్షాపునకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్.. అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే అటవీ సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదన్న పవన్ కళ్యాణ్.. వారికి ఇబ్బందులు కలిగించేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అటవీ శాఖ సిబ్బందికి ఏదైనా సమస్య వస్తే నేరుగా తనను సంప్రదించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.