రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..అసలేమైంది?

1 year ago 26
వైఎస్ఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతోందని, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీల యజమానుల వైఖరిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కాంట్రాక్టులు తనకే కావాలంటూ ఆయన పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Entire Article