మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చేజారిపోవడంతో.. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.