Vangaveeti Ranga Daughter Political Entry: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తండ్రి ఆశయ సాధన కోసం.. తాను కూడా కృషి చేస్తానని, ప్రజల కష్టాల్లో అండగా ఉంటానని ఆమె తెలిపారు. రాధా, రంగా మిత్రా మండలిల మధ్య ఉన్న గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అని.. దాన్ని పూరించడమే తన లక్ష్యమని ఆశా కిరణ్ పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు.