ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మే 2న అమరావతి ప్రాంతంలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ బైపాస్ రహదారిలో గొల్లపూడి నుంచి కాజ వరకు వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. వారి సౌకర్యార్థం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. భారీగా వాహనాలు రాకపోకలు ఉండటంతో విజయవాడ బైపాస్లో కొంత భాగం ఆ ఒక్క రోజు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు తెలిపారు.