రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొక మరణం సంభవించింది. రామలక్ష్మి అనే వృద్ధురాలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 12కు పెరిగింది. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికల వివరాలు శనివారం వెల్లడయ్యాయి. పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలవడంతోనే బాధితుల కిడ్నీలు దెబ్బతిన్నట్లు నివేదికలు వెల్లడించాయి.