రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరొకరు మృతి, ఇప్పటి వరకూ 12 మంది..

1 month ago 9
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొక మరణం సంభవించింది. రామలక్ష్మి అనే వృద్ధురాలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 12కు పెరిగింది. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికల వివరాలు శనివారం వెల్లడయ్యాయి. పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలవడంతోనే బాధితుల కిడ్నీలు దెబ్బతిన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
Read Entire Article