ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.. అయితే, తన కుమారుడిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గతంలోనూ తప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడు పెట్టిన కేసు కూడా నిలబడదని ఆయన అన్నారు.