రాజమండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో పలువురు అనారోగ్యం బారిన పడటం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల కిందట పలువురు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం వైద్యశాఖ అధికారులకు చేరటంతో వారు.. పరిశీలన జరుపుతున్నారు. అనారోగ్యానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే పాలు తాగడం వలనే అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెప్తున్నారు. దీంతో పోలీసులు పాలుపోసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.