గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని మత్తుమయం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, గత ఎన్నికల్లో తమ పార్టీ సరిగ్గా లేకపోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.