తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాయితీ రుణాలు ఇవ్వడానికి దీనికి ఏప్రిల్ 5, 2025 వరకు దరఖాస్తుల ప్రక్రియను చివరి తేదీ అని పేర్కొనగా.. తాజాగా దీని గడువును పెంచారు. తాజా సమాచారం ప్రకారం, చివరి తేదీ ఏప్రిల్ 15, 2025గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.