భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (బీటీపీఎస్) రైలు మార్గం కోసం భూములు కోల్పోయి పరిహారం తీసుకోని నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వారికి రూ. 4 లక్షల వరకు రుణం, 70 శాతం రాయితీ లభించనుంది. మిగిలిన 30 శాతం జెన్కో చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సహాయంతో నిర్వాసితులు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుంది.