తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ఆలస్యం కావడంతో మరింత ఆలస్యం కానుంది. భారీగా దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సిబిల్ స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుండటంతో, యూనిట్ల మంజూరుకు మరో వారం, పది రోజులు పట్టే అవకాశం ఉంది. అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ పథకం ప్రారంభం కావడానికి మరో 10 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.