తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించనుంది. 80 శాతం సబ్సిడీతో రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందించనున్నారు. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు రాగా.. జూన్ 2న రూ.1000 కోట్ల నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు. ఇది యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.