నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన 'రాజీవ్ యువ వికాసం' స్వయం ఉపాధి పథకం అమలు అనిశ్చితిలో పడింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల నుంచి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 42,138 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు బ్యాంక్ రుణం, రాయితీ ద్వారా ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. అధికారులు సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా, ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు నిరాశగా మారాయి.