రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తొర్రూరులో నిర్వహించిన వేలంలో 100 ప్లాట్లను వేలం వేయగా.. చదరపు గజం రూ.65,700 వరకు పలికింది. ఈ వేలం ద్వారా కార్పొరేషన్కు రూ.105 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో బహదూర్పల్లిలో నిర్వహించిన వేలంలో కూడా మంచి స్పందన వచ్చింది.