మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఇటీవల విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కూడా భగ్గుమన్నాయి. తాజాగా వైసీపీ, వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి కోటరీ గురించి ఓ కథ చెప్తూ ట్వీట్ చేశారు.