ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను టీడీపీ తన ముగ్గురు అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్లను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, యువత ప్రోత్సాహం, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు వీరిని ఎంపిక చేసి బీ-ఫామ్లు అందజేశారు. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే నామినేషన్ వేయగా.. టీడీపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కూటమికున్న బలంతో ఈ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయమైంది.