ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి కారణమైంది. రాజ్యసభ సీటును ఆశించిన కడప జిల్లా టీడీపీ సీనియర్ లీడర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి.. అవకాశం రాకపోవటంపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవటం నిరాశను కలిగించిందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కాసేపటికే పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ట్వీట్ చేయడం గమనార్హం.