అమరావతి బిల్లు సందర్భంగా రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన కమరావతి వ్యాఖ్యలపై వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి అంశంపై విలేకర్ల సమావేశం నిర్వహించిన సజ్జల.. రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. పైగా గ్యాలరీలో నుంచి నారా లోకేష్ ఆమెకు దండం కూడా పెట్టారని విమర్శించారు. ఇంత చేస్తూ వైసీపీ కులముద్ర వేస్తోందని ఆరోపిస్తారంటూ సజ్జల కౌంటర్ ఇచ్చారు.